ద్విపదభాగవతం - మధురకాండ : కంసుని స్త్రీలు తమపతి మరణమునకు విలపించుట
భర్తపై వ్రాలుచు బహుభంగి నొగిలి
"హా! యని యేడ్చుచు హా నాథ! యనుచు
పోయితే! మముబాసి భోజవంశాఢ్య!
కటకటా! శోకానఁ గ్రాలంగ మమ్ము
నిటఁ జూడవించుక యేలఁ గైకొనవు?
ఇనుఁడు నీమీఁదట యెండరా నోడు;
ననిలుండు నీమీఁ ద నటవీవ వెఱచు;
ననలుండు తీవ్ర్రార్చు లడరింప నోడు;
ననిమిషాదులు మీకు నడకుదు రెవుడు;
నీ యాజ్ఞ నీలావు నీరాజసంబు
నీ యొప్పు నీనేర్పు నీమంచితనము. - 250
వ్రేయవారలచేత వేల్మిడినడఁ గి
మాయమైపోయితే మనుజ దేవేంద్ర!"
అని బహుభంగుల నార్తులైపొగుల
వనితలనూరార్చి వాసుదేవుండు